ద్విపదభాగవతం - మధురకాండ : కంసుని భార్యలు మగధేసునివద్ద మొఱయిడుట
అస్తియు ప్రాస్తియు నను కంసు భార్య
లస్తికుండను మగధాధీశు సుతలు
హరిచేతఁ దమభర్త యడఁగిన దుఃఖ
పరవశలై తండ్రిపాలికేతెంచి
యడుగులపైఁ బడి యడలూనఁ జెప్పఁ
గడురోషభీషణాగ్రహవృత్తిఁ బలికె
“ఏమేమిరా! కృష్ణుఁడే యింత సేసె!
భూమి నయాదవంబుగ సేయవలయు”